Thursday, May 2, 2024

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. తీవ్రంగా గాయపడిన కార్మికులు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్‌ః జమ్ముకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బుధవారం ఉదయం అనంత్‌నాగ్ జిల్లాలో ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వలస కార్మికులను స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం భద్రతా బలగాలతో కలిసి సంఘటనా ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News