Friday, April 26, 2024

యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం…. 20 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కనౌజ్ జిల్లా చిలోయి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ట్రక్కు, ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది  సజీవదహనం కాగా మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కనౌజ్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కనౌజ్ ఎస్‌పి అమ్రేంద ప్రసాద్ సింగ్ తెలిపాడు. బస్సులో 43 మంది ప్రయాణికులు గుర్షాయి గంజ్ నుంచి జైపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి వెంటనే 50 వేల రూపాయలు విడుదల చేశారు. రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి.

 

 

 

20 Members Death with flame in Road Acciden in UP
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News