లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కనౌజ్ జిల్లా చిలోయి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ట్రక్కు, ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది సజీవదహనం కాగా మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కనౌజ్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కనౌజ్ ఎస్పి అమ్రేంద ప్రసాద్ సింగ్ తెలిపాడు. బస్సులో 43 మంది ప్రయాణికులు గుర్షాయి గంజ్ నుంచి జైపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి వెంటనే 50 వేల రూపాయలు విడుదల చేశారు. రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి.
Kannauj: A bus carrying 50 passengers catches fire after collision with a truck on GT Road. Fire tenders have rushed to the spot. More details awaited pic.twitter.com/aRdZC8ElhG
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2020