Saturday, May 4, 2024

సోషల్ మీడియాలో విరాట్ రికార్డు

- Advertisement -
- Advertisement -

200 million followers in Virat kohli instagram

ఢిల్లీ: సోషల్ మీడియాలో టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న భారతీయుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇన్‌స్టాలో విరాట్ 200 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్నవారిలో కోహ్లీ మూడో స్థానంలో ఉండగా క్రిస్టియానో రొనాల్డో 451 మిలియన్లు, లియోనల్ మెస్సీ 334 ఫాలోవర్లతో తొలి రెండు స్థానాలలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్టా ఫ్యామిలీ మెంబర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. కంగ్రాట్స్ భాయ్… ‘మా గుండెల్లో నీ స్థానం ఎప్పుడు పదిలంగా ఉంటుందని, మా కింగ్ వు నువ్వేనని’ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. 177 మిలియన్లు ఉన్నప్నుడు ఒక పోస్టుకు ఐదు కోట్ల రూపాయలు సంపాదించేవాడు. గత కొన్ని రోజుల రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లేమితో బ్యాటింగ్ పరంగా రాణించలేకపోతున్నాడు. విరాట్ కు ఫేస్‌బుక్‌లో 49 మిలియన్ మంది ఫాలోవర్లు ఉండగా ట్విట్టర్‌లో 48.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News