- Advertisement -
ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది చనిపోయారు. వారిలో 211 మంది బాధితులను వారి డిఎన్ఎ మ్యాచింగ్తో గుర్తించారు. కాగా భౌతికకాయాలలో 189 వారి సంబంధికులకు అప్పగించారు. వాస్తవానికి 242 మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్లోని మెడికల్ కాంప్లెక్స్పై జూన్ 12న కూలింది. విమానంలో ప్రయాణించిన ఒక్కరు తప్ప అంతా చనిపోయారు. అది కూలినప్పుడు నేలపైన ఉన్న 29 మంది కూడా మరణించారు. ప్రస్తుతం గుర్తించిన 189 మంది బాధితులలో 142 భారతీయులవి, 32 బ్రిటిష్ పౌరులవి, ఏడుగురు పోర్చుగీస్, ఒకరు కెనడాకు చెందిన వారివి. నేలపై మరణించిన వారిలో ఏడుగురి భౌతిక కాయాలను కూడా వారి బంధువులకు అప్పగించినట్లు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ జోషి విలేకరులకు తెలిపారు.
- Advertisement -