Sunday, April 28, 2024

26/11 ముంబై ఉగ్రవాదుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

- Advertisement -
- Advertisement -

26/11 Mumbai terror attack handler jailed

లాహోర్ (పాకిస్థాన్ ) : ముంబై ఉగ్రదాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మజీద్ మీర్‌కు పాకిస్థాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2008 ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్ అయిన నిషేధిత లష్కరే తొయిబా (ఎల్‌ఇటి) కార్యకర్త సాజిద్ మజీద్ మీర్‌కు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో పాకిస్థాన్ లోని యాంటీ టెర్రరిజం కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పంజాబ్ పోలీస్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేసిన ఈ కేసులో జైలులో జరుగుతున్న ఇన్ కెమెరా ప్రొసీడింగ్ కావడంతో మీడియాను అనుమతించలేదు. 40 ఏళ్ల మధ్యలో ఉన్న దోషి మీర్ ఈ ఏప్రిల్‌లో అరెస్టు అయినప్పటి నుంచి కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్నారని న్యాయవాది తెలిపారు. కోర్టు దోషికి రూ.4,00,000 జరిమానా కూడా విధించిందని న్యాయవాది చెప్పారు.

166 మందిని బలిగొన్న 26/11 ముంబై దాడుల్లో సాజిద్ మీర్ భారత దేశం యొక్క మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. మీర్‌ను ముంబై దాడులకు ప్రాజెక్ట్ మేనేజర్ అని పిలిచేవారు. మీర్ 2005 వ సంవత్సరంలో మారు పేరుతో నకిలీ పాస్‌పోర్టును ఉపయోగించి భారత దేశాన్ని సందర్శించినట్టు సమాచారం. మరోవైపు ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి , జైయూడీ చీఫ్ హఫీజ్ సయీద్‌కు లాహోర్ ఏటీసీ ఇప్పటికే ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో 68 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ముంబై దాడి ఆపరేషన్ కమాండర్ జకీపుర్ రెహ్మాన్ లఖ్వీ కూడా కొన్నేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సయీద్, షూకీ ఇద్దరూ లాహోర్ లోని కోట్ లప్‌ఖాఫ్ట్ జైలులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News