Friday, April 26, 2024

కొత్తగా 2,841 కరోనా కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

2841 new covid-19 cases reported in india

న్యూఢిల్లీ: దేశంలో గురువారం ఒక్కరోజే కొత్తగా 2,841 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,16,254కు పెరిగింది. కాగా.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,604కు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం దేశంలో గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 9 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 5,24,190 కరోనా మరణాలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో 463 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతం ఉంది. దేశంలో మొత్తం 4,25,73,468 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వైరస్ కారక మరణాల సంఖ్య 1.22 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ కింద దేశంలో ఇప్పటివరకు మొత్తం 190.99 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగినట్లు కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News