Thursday, April 25, 2024

రాష్ట్రంలో కొత్తగా 296 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

296 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 296 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. బుధవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,61,302కు పెరిగింది. తాజాగా 322 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,52,085 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,893కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.60 శాతంగా నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,324 యాక్టివ్ కేసులున్నాయి. శనివారం 69,833 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News