- Advertisement -
మనతెలంగాణ, హైదరాబాద్: ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద నిర్మిస్తున్న వాక్వే, స్టేయిర్ కేస్ పనుల కోసం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ఎం విజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 12వ తేదీ 12 తెల్లవారు జామున గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. అల్లాపూర్ నుంచి గూడ్స్ షెడ్ రోడ్, హైటెక్ సిటీ, కూకట్పల్లి వైపు వెళ్లే వాహనాలను కూకట్పల్లి వై జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని నర్సాపూర్ ఎక్స్ రోడ్డు, బోయిన్పల్లి, హైదరాబాద్ వైపు మళ్లించనున్నారు. అల్లాపూర్ నుంచి గూడ్స్ షెడ్ రోడ్డు, హైటెక్సిటి, కూకట్పల్లి వైపు వచ్చే వాహనాలను జెకె పాయింట్ ఎర్రగడ్డ వద్ద లెఫ్ట్ తీసుకుని సనత్నగర్ పిఎస్ రోడ్డు, అక్కడి నుంచి రూటర్న్ తీసుకుని బల్కంపేట, హైదరాబాద్ వైపు మళ్లిస్తారు.
- Advertisement -