Tuesday, May 14, 2024

డివైడర్ ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

3 killed in car collided with divider at chittoor

అమరావతి: చిత్తూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిక కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పూతలపట్టు మండలం పి. కొత్తపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను కర్నాటక పోలీసులుగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కారు డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News