Sunday, May 12, 2024

తిరుమల సమాచారం: భక్తులతో 31 కంపార్టుమెంట్లు ఫుల్

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం సెలవు రోజు కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఈ క్రమంలో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.

శనివారం శ్రీవారిని 81,212 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,403 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి ఆలయ హుండీ ఆదాయం రూ..2.88 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News