- Advertisement -
భోపాల్: మధ్యప్రదేశ్లో విషాదం సంఘటన చోటు చేసుకుంది. ఇండోర్లో పాటల్పానీ ప్రాంతంలోని ఫామ్ హౌస్ లో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్లో మంగళవారం తాత్కాలిక లిఫ్ట్ కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. ఈ ఘటన సమయంలో అక్కడ పనిచేస్తున్న వారు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే, తీవ్రంగా గాయపడడంతో ఆరుగురు మృతి చెందారని, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాపారి పునీత్ అగర్వాల్ (53)తోపాటు మరో ఐదుగురు కుటుంబ సభ్యులు ఈ ఘటనలో మృతి చెందారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
6 dead after lift collapse in Madhya Pradesh
- Advertisement -