Saturday, April 27, 2024

తమిళనాడులో ఎనిమిదేళ్ల చిన్నారిపై హత్యాచారం

- Advertisement -
- Advertisement -

Rape,

చెన్నై: ఒక ఎనిమిదేళ్ల బాలికపై అత్యంత పాశవికంగా హత్యాచారానికి పాల్పడిన అస్సాంకు చెందిన ఒక 20 ఏళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తమిళనాడులోని శివకాశి పట్టణానికి సమీపంలోగల కొంగలాపురం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం తన ఇంటి బయట అదృశ్యమైన ఒక దినసరి కార్మికుని ఎనిమిదేళ్ల కుమార్తె మృతదేహం అరకిలోమీటరు దూరంలో తుప్పల్లో మంగళవారం లభించింది. ఆ చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కేసులో ఆరుగురు వలస కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఒక చిన్న తరహా పరిశ్రమలో పనిచేస్తున్న మజీద్ అలీ అనే యువకుడు తానే ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

మూత్ర విసర్జన కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి హతమార్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని ఒక అధికారి చెప్పారు. మొదట్లో ఇది సామూహిక అత్యాచారంగా పోలీసులు అనుమానించినప్పటికీ చివరకు ఒక వ్యక్తే ఈ హత్యాచారానికి పాల్పడినుట్ల దర్యాప్తులో వెల్లడైందని ఆయన చెప్పారు. మూడవ తరగతి చదువుకుంటున్న ఆ బాలిక సోమవారం సాయంత్రం స్కూలు వదలిని తర్వాత తన తండ్రి పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్లింది.

మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లిన ఆ బాలిక తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాచారం సంఘటన వెలుగులోకి రావడంతో రాజకీయ పార్టీలు, పౌర సమాజం తీవ్రంగా స్పందించింది. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండు చేస్తూ ఆ ప్రాంతంలో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

8 Year old girl raped and murdered in TN, A migrant worker from Assam has raped and murdered near Sivakasi of TN

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News