Sunday, May 5, 2024

మళ్లీ 8 వేలకు పైగా కరోనా కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

8822 new covid cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మరోసారి 8 వేలకు పైగా రాగా, ముందు రోజు కంటే 33 శాతం అధికంగా నమోదయ్యాయి. క్రియాశీల కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. మంగళవారం 4.40 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా, 8822 మందికి వైరస్ సోకినట్టు తేలింది. క్రితం రోజు ఆ సంఖ్య 6594గా ఉంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2 శాతానికి చేరింది. మహారాష్ట్రలో 2956 , కేరళలో 1986, ఢిల్లీలో 1118 మందికి కరోనా సోకింది. హర్యానా, కర్ణాటకతో సహా అనేక రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటివరకు 4.32 కోట్ల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో క్రియాశీల కేసులు 53,637కి ఎగబాకాయి. మొత్తం కేసుల్లో వాటి వాటా ౦.12 శాతానికి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 5718 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 98.66 శాతం మంది వైరస్ నుంచి బయటపడ్డారు. మంగళవారం 15 మంది మరణించగా, మొత్తం 5.24 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిన్నర కాలంలో 195 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. అందులో మంగళవారం 13.58 లక్షల మంది టీకా తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News