Thursday, May 2, 2024

నిరుపేద విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు: సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

Poor students excel in sports: satyavathi rathod

క్రీడాకారిణి శాంతాకుమారిని మంత్రి అభినందనలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఎంతో మంది నిరుపేద విద్యార్థులు నేడు విద్య, క్రీడల్లో రాణిస్తున్నారని మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నిరుపేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. జూన్ 613 తేదీల్లో థాయిలాండ్‌లో జరిగిన 14వ ఆసియా వాలీబాల్ మహిళల అండర్ 18 కేటగిరి ఛాంపియన్ షిప్ లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన కె. శాంతాకుమారిని మంత్రి బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో శాంతాకుమారిని ఘనంగా సన్మానించారు. లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ గురుకుల పాఠశాలలో చదువుకుని, అండర్ 18 కేటగిరి వాలీబాల్ భారత జట్టుకు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన తొలిబాలిక శాంతాకుమారి అని మంత్రి అన్నారు. శాంతాకుమారి స్వగ్రామం వనపర్తి మండలం చిట్యాల తూర్పు తండా అని తెలిపారు. క్రీడలలో రాష్ట్ర పేరును నిలబెడుతున్న శాంతాకుమారికి అన్ని విధాల అండగా నిలుస్తామని మంత్రి హామినిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఇలాగే మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రం, దేశం పేరు నిలబెట్టాలని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పేద విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసేందుకు ప్రభుత్వం నెలకొల్పిన గురుకులాలు దోహదపడుతున్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News