- Advertisement -
జమ్మూ: దుర్గాష్టమిని పురస్కరించుకుని జమ్మూ కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జి) మనోజ్ సిన్హా బుధవారం తరికూట పర్వతాలలో కొలువై ఉన్న మాత వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఈ గుహాలయానికి వెళ్లే మార్గంలోని ముఖ్య ప్రదేశాలలో ఆరు హైటెక్ మల్టీపర్పస్ వీడియో వాల్స్ను ఆయన ప్రారంభించారు. దీని వల్ల భక్తులు ఆలయంలో జరిగే అమ్మవారి హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. వైష్ణోదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాష్టమి లేదా మహా అష్టమి పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
- Advertisement -