Saturday, May 4, 2024

మెస్సికి అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

దోహా: అర్జెంటీనాకు ప్రపంచకప్ ఫుట్‌బాల్ ట్రోఫీని సాధించి పెట్టిన స్టార్ ఆటగాడు లియొనల్ మెస్సికి అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల ఖతర్ వేదికగా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఖతర్‌లో మెస్సి బస చేసిన హోటల్ రూమ్‌ను మ్యూజియంగా మార్చడానికి అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మెస్సి బస చేసిన హోటల్ రూమ్‌ను మ్యూజియంగా మార్చుతున్నట్టు ఖతర్ యూనివర్శిటీ వెల్లడించింది. ఇక నుంచి ఆ రూమ్‌ని ఎవరికి కేటాయించమని వర్శిటీ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News