Tuesday, April 30, 2024

స్మిత్ ఔట్… ఆసీస్ 77/2

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఎంఎ చిదంబరం స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ 13 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 77 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. స్టివెన్ స్మిత్ పరుగులేమి చేయకుండా హర్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ట్రావిస్ హెడ్ 33 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో డెవిడ్ వార్నర్(02), మిచెల్ మార్ష్(42) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. హర్దిక్ పాండ్యా రెండు ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీయడంతో భారత జట్టు ఊపిరిపీల్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News