Thursday, May 9, 2024

ఆస్తి కాజేసేందుకు కుట్ర..మాజీ ఐఆర్‌ఎస్ అధికారి ఇంట్లో చోరీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీ ఐఆర్‌ఎస్ అధికారి శామ్యూల్ ఇంట్లో చోరీ చేసి కోట్లు విలువైన పత్రాలను ఎత్తుకెళ్లిన కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న దుండిగల్‌కు చెందిన ఎస్‌ఐ కృష్ణను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశారు. ఎస్‌ఐ కృష్ణ వ్యవహారంపై ఉన్నతాధికారితో విచారణకు ఆదేశించారు. శామ్యూల్‌ను మత్తు మందు ఇచ్చి చంపేందుకు సురేందర్ అనే వ్యక్తికి ఎస్‌ఐ కృష్ణ సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. దాదాపు రూ.100 కోట్ల విలువైన ఆస్తులను కాజేసేందుకు కూడా సురేందర్‌కు కృష్ణ సహకరించినట్లు అభియోగాలు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News