Wednesday, May 22, 2024

అక్టోబరులోగా సింగరేణి ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి యూనియన్ ఎన్నికలను అక్టోబరులోగా నిర్వహించాలని సంస్థ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలను వాయిదా వేయాలన్న సింగరేణి సంస్థ అభ్యర్థనను తిరస్కరించింది. సింగరేణి ఎన్నికలకు మే 22న కేంద్ర కార్మిక సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలు, వరుస పండగలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియను కొనసాగించి అక్టోబరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News