Tuesday, May 21, 2024

పట్టపగలే దారుణం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పట్టపగలే మహిళా టీచర్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే.. కర్ణాటకలోని హాసన్ జిల్లాలకు చెందిన 23 ఏళ్ల అర్పిత స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంది. గురువారం సెలవు ఉండటంతో స్కూల్ బయట నిల్చున్న ఆమెను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఎస్ యూవీ వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. ఆమె కేకలు వేయడంతో కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సిసిటివి పుటేజ్ ను పరిశీలించి, అర్పిత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News