- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కసరత్తులు ముమ్మరం జరుగుతున్నాయి. కెబినేట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆదివారం రాష్ట్ర కెబినేట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసందే.
- Advertisement -