Thursday, June 19, 2025

నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

- Advertisement -
- Advertisement -

నైరుతి రుతుపవనాలు వేగంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. బుధవారం రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రద్రా కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్క ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఒడిశా వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్ సహ ఇతర జిల్లాల్లో సైతం మేఘావృతమైన వాతావరణం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News