ప్రైమ్ వీడియో గురువారం తన రెండవ తెలుగు ఒరిజినల్ చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ను విడుదల చేసింది. ఎల్లనార్ ఫిలిమ్స్ ప్రై.లి. బ్యానర్పై రాధిక లావూ నిర్మాణంలో ఐ.వి. శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. వసంత్ మరింగంటి రచించిన ఈ చిత్రంలో సుహాస్, జాతీయ అవార్డు- గెలుచుకున్న నటి కీర్తి సురేష్ ప్రధానపాత్రలు పోషించగా, బాబు మోహన్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి ఇతర కీలక పాత్రలలో నటించారు. ఉప్పు కప్పురంబు చిత్రం భారతదేశంతో ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలలో జూలై 4న ప్రైమ్ వీడియో పై ప్రీమియర్ గా ప్రత్యేక ప్రసారానికి సిద్ధంగా ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషలలో డబ్బింగ్ మరియు ఇంగ్లీష్ తో కలిపి 12 భాషలలో సబ్టైటిల్స్ తో ప్రసారం అవుతుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటైన కార్యక్రమంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ “ఈ ఉప్పు కప్పురంబు కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో అపూర్వ అనేది ఒక భిన్నమైన పాత్ర నాది” అని అన్నారు. సుహాస్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో నేను చేసిన చిన్నా పాత్ర ఇదివరకు చేసిన పాత్రల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలిపారు.