Sunday, June 22, 2025

ప్రపంచశాంతికి యోగామార్గం

- Advertisement -
- Advertisement -

విశాఖపట్టణం: పలు దిక్కుల పిక్కటిల్లే రీతిన ఉన్న ఘర్షణల కాలంలో యోగాచరణ, అభ్యాసం శాంతికి చక్కని మార్గదర్శకం ఇస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రసరింపచేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో సాగరతీరంలో వెలిసిన విశాఖపట్టణం విస్తారిత బీచ్‌లో శనివారం జరిగిన రికార్డు స్థాయి యోగా ప్రదర్శనను ఉద్ధేశించి ప్రధాని ఉద్వేగభరిత ప్రసంగం చేశా రు. ప్రపంచం అంతటా ఏదో విధమైన ఉద్రిక్తతలతో తల్లడిల్లుతోంది. ప్రాంతాలవారిగా అశాంతి, అస్థిరత చిచ్చు రగులుతోంది.ఈ దశలో యోగాతో సవ్యమైన ప్రశాంతికిదారి ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశా రు. మనిషి అంతర్గత ఆకాంక్షిత శాంతి వెల్లువెత్తి ప్రపం చ శాంతి విధానానికి దారితీయాల్సి ఉందని తెలిపారు. మానవాళికి అవసరం అయిన ప్రశాంతి మన యోగా దైనందిన ప్రక్రియతో ఉషోదయ వేళలో ఆరంభమవుతుందని, ఇది మన సాంప్రదాయక విశిష్టత అన్నారు.

ఇప్పుడు మన ప్రపంచం ఎటు నుంచి ఎటుపోతున్నదనేది అందరికీ తెలిసిందే. కక్షలు కార్పణ్యాలతో అధోజగతి ప్రస్థానం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు అశాంతి అస్థిరతకు, దారితీస్తుంది. ఇప్పుడు మనకు దారి ఏది అనుకునే దశలో ఓ వెలుగు రేఖగా ఈ యోగా కళ్ల ముందు నిలుస్తోందని చెప్పారు. మనం కోల్నోయిన శాంతి తీరానికి ఇది చేరుస్తుందని స్పష్టం చేశారు. మనిషి కోరుకునే స్దచ్ఛమైన శ్వాస రేపటిపై ఆశ అంతా కూడా మన ఈ శ్వాస ధ్యానాల ప్రక్రియ యోగాపై ఆధారపడి ఉందన్నారు. సమతూకత పాటించడం సమస్తం కావడం యోగా కీలక నినాదం అన్నారు. ఇప్పటికైనా బాధాతప్త ప్రపంచం సరికొత్త మానవతా అధ్యాయం హుమానిటి 2.0 కొసం ఈ యోగాను అలవర్చుకోవల్సి ఉందన్నారు. అశాంతికి మీటలు నొక్కడం కాదు, మానసిక ప్రశాంతతకు అవసరం అయిన బటన్ మన శ్వాసలోనే ఉందని గుర్తించాలని పిలుపు నిచ్చారు. మానవాళి మరో అధ్యాయానికి ఈ యోగా నాంది కావల్సి ఉందన్నారు.

సరిహద్దులు లేని సరిగమ
యోగాకు సరిహద్దులు లేవు, భాష మతం, ఖండాలు దే శాల ఎల్లలు లేవు. ఏ మారుమూల ప్రాంతంలో అయినా ఎటువంటి దాడుల భయాలు లేకుండా ఈ ప్రక్రియకు దిగవచ్చు. మన స్వేచ్ఛానుసారం యోగా చేసుకోవచ్చు. ఈ క్రమంలో వ్యక్తి పొందే విజయం చివరికి శాంతి స్థాపనకు దారితీస్తుందన్నారు. వయో, పూర్వాశ్రమ ప్ర స్తుత పరిస్థితులకు అతీతంగా ఉండేదే సాగేదే యోగా అ న్నారు. ఇప్పటి యోగా దినోత్సవానికి ఇతివృత్తం ప్రధానంగా వసుధైక కుటుంబం, అంటే ఒకే భూమి ఒకే ఆ రోగ్యం అనే అంతర్లీన సందేశం అన్నారు. ఇందులో ని గూఢ సత్యం ఉందని చెప్పారు. ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అ వసరం, ఇది అనుసంధాన ప్రక్రియగానే సిద్థిస్తుందన్నా రు.

యోగా అంటే ఆరోగ్యం, సక్రమ క్రమశిక్షణ, నేను నుంచి మనం వైపు తీసుకువెళ్లే డొంకదారులు లేని రాజమార్గం. అతి తక్కువ వ్యవధిలో అంటే 11 ఏండ్లలోనే ప్రపంచంలోని 175దేశాలు ఈ భారతీయ ఆరోగ్య సంవిధానానికి ఆమోద ముద్రవేశాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఇది నిత్యనూతన జీవిత ప్రదాయిని అయిందని ఇది భారత్‌కు గర్వకారణం అన్నారు. సిడ్ని ఒపేరా హౌస్ నుంచి ఎవరెస్టు శిఖరం దాకా ఖం డాంతరాల వరకూ నేడు యోగా ఓ ఆచరణీయ ప్రక్రియ అయింది. యోగా సార్వత్రికం , సగర్వ పతాక శీర్షికం అన్నారు. మనసు శనీనం మస్కిష్కాల లయాత్మక సమన్వయం కల్గించే అపార ఆనందం యోగాతోనే సొంతం అవుతుంది. భారత్‌కు ఇది శాశ్వతం అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News