Friday, June 27, 2025

తొలి బోనమెత్తిన గోల్కొండ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాంపల్లి: చారిత్రాత్మక గోల్కొండ కోట లో శ్రీ శక్తిమంతురాలైన శ్రీ జగదాంబిక ఆలయంలో బో నాల సందడి ఉత్సవాలు అంగరంగ వైభవంగా, తెలంగా ణ భక్తి సంస్కృతిని చాటెలా ప్రారంభమయ్యాయి. దీం తో ఒక్కసారిగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుని, భక్తు లు భక్తి పారవశ్యంతో తన్మయులయ్యారు. అమ్మవారి అనుగ్రహం, కరుణ కటాక్షం కోసం పరితపించారు. జంటనగరాలు, వివిధ జిల్లాల నుంచి మహిళలు మాతేశ్వరికి పసుపు, కుంకుమ, బోనాల సమర్పణతో ఈ ఉ త్సవాలు అత్యంత భక్తి పారవశ్యంతో షురూ అయ్యాయి. గురువారం ఆషాడ మాసం బోనాలు తెలంగాణ వ్యాప్తం గా శ్రీకారం చుట్టాయి. తెలంగాణ జనజీవన సంస్కృతి, భక్తి సంప్రదాయాల ప్రతిబింబించేలా గోల్కోండ కోటలో సంప్రదాయంగా మహిళలు,భక్తులు బోనమెత్తారు. తొలు త ఉత్సవాల్లో భాగంగా వేదమంత్రోచ్ఛరణల మధ్య పూ జారి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తొలి బోనం, పుసుపు, కుంకుమ అమ్మవారికి సమర్పించారు. ఉత్సవాల్లో అమ్మవారి ఆశీస్సుల పొందేందుకు వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడం లంగర్‌హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు జనసందోహంతో కిక్కిరిసిపోయింది. అనంతరం లంగర్‌హౌస్ వద్ద ఆకర్షణీయ తొట్టెలకు పూజలు నిర్వహించారు.

రాష్ట్ర శాసనాసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, రాష్ట్ర మంత్రులు కొండా సు రేఖా, పొన్నం ప్రభాకర్, గ్రేటర్ మేయర్ విజయలక్ష్మీ, దేవాదాయశాఖ అధికారులు భక్తి నినాదాలు, డప్పువాద్యాల మద్య పూజలు జరిపారు.అమ్మవారి ఆశీస్సులు పొందారు. సంప్రదాయంగా అమ్మవారికి ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. సాక పెట్టారు. కళాకారులు, మహిళలు బోనాలు తలలపై పెట్టుకుని కోలా టం అందరి దృష్ఠిని ఆకట్టుకున్నాయి. పోతరాజుల వీ రంగం, డప్పువాయిద్యాల హోరు. భక్తి నినాదాలు, కేరింతల మధ్య ఆట్టహాసంగా సాగిన బోనాల ఊరేగింపు కన్నుల పండువగా సాగి.. గోల్కొండ కోట వద్ద పూజారి ఇంటి వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా కోట పైగా కొలువుదీరిన శ్రీ జగదాంబిక ఆలయం వెళ్లే మెట్లకు భక్తులు తమ కోర్కేలు తీరాలంటూ కుంకుమ, పసుపులు పెట్టారు. ఆషాడ మాసం పూర్త అయ్యే వరకు ప్రతి గురు, ఆదివారాల్లో అమ్మవారికి భక్తులు తమ మొక్కులు సమర్పిస్తారు. పోతరాజుల వీరంగం, నృత్య విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, తొట్టెల ఊరేగింపు, భక్తి నినాదాలు మధ్య ప్రత్యేక సందడి నెలకొన్నది. వేషధారణలు, డప్పు వాద్యాల హోరు వంటి దృశ్యాలు బోనాల ఉత్సవాల్లో కనిపించాయి. ఉత్సవాల్లో ఎంపీ ఎం.అనీల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర వైశ్యా ఆర్థిక సంస్థ ఛైర్మన్ కలువ సుజాత, రాష్ట్ర బీసీకమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్, రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలాజా రమాయ్యర్, దేవాదాయశాఖ కమిషనర్ వెంకటరావు, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, గ్రేటర్ డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, బీజేపీ నాయకులు మాధవిలత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,ఆలయ కమిటీ ఛైర్మన్ చిట్టిబాబు పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలతోపాటు ఆసంఖ్యాక భక్తులు పాల్గొన్నారు. భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు జరగకుండా ముందస్తుగా అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందో బస్తు పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షించడంలో నిమగ్నమయ్యారు.

అమ్మవారి అనుగ్రహం ప్రజలపై ఉండాలి:శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్
గోల్కొండ కోటపై వెలిసిన శ్రీ జగదాంబిక అమ్మవారి అనుగ్రహం, కరుణకటాక్షం ప్రజలపై తప్పకుండా ఉండాలి, సుధీర్ఘకాలంగా నగరంలో బోనాల ఉత్సవాల సంస్కృతి నిర్వహించడం కొనసాగుతోందని, అమ్మవారి చాలా మహిమగల తల్లి అని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి రూ. 20 కోట్లు విడుదల చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్న లక్షంతో ప్రభుత్వం పనిచేస్తోందని కొనియాడారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ గోల్కొండ బోనాల ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత, భక్తిభావాలు సంతరించుకున్నాయన్నారు. జంటనగరాల దారులన్నీ గోల్కొండ కోట వైపే ఉన్నాయని, ఈ దిశగా భారీ సంఖ్యలో తరలొచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు,. అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు. తెలంగాణ బోనాలు ప్రజల సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని, గత సర్కార్ కంటే ఈ దఫా బోనాల ఉత్సవాలకు మెరుగ్గా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆషాడ మాసంలో సంప్రదాయ రీతుల్లో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బొనం సమర్పించడం తాను అదృష్టంగా భావిస్తున్నాను.. భక్తులకు ఎలాంటి ఇక్కట్లు జరగకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించామని ఆమె వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News