Monday, April 29, 2024

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

65 కిలోల గంజాయి స్వాధీనం

మన తెలంగాణ/హైదరాబాద్: గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 65 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు శేరిలింగంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో జిల్లా డిపిఈఓ సత్యనారాయణ వెల్లడించారు. ఎన్నికల బందోబస్తు లో భాగంగా ఆదివారం రాత్రి శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద శంషాబాద్ , శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టగా ఒరిస్సాలోని మల్కన్ గిరి నుంచి నగరానికి రైలులో గంజాయి రవాణా చేస్తున్న సూరజ్ నవనాధ్ యాదవ్ (22) అనే మహారాష్ట్రకు చెందిన యువకుడిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 65 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో శేరిలింగంపల్లి ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ లక్ష్మణ్ గౌడ్, ఎస్‌ఐలు శ్రీనివాస్, వీరబాబు,సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News