- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాల్పుల మోత ఆగలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్ఎ నరేష్ యాదవ్ విజయోత్సవ ర్యాలీలో కాల్పుల కలకలం రేగింది. ఎంఎల్ఎపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నరేష్ యాదవ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ ఈ ఘటనలో ఆప్ కార్యకర్త ఆశోక్ మన్ మృతి చెందగా… మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని చికిత్స నిమిత్తం తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. మెహ్ రౌలీ నుంచి గెలిచిన నరేష్ యాదవ్. గెలుపు తర్వాత గుడిలో దర్శనం చేసుకొని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల ఘటనను ఆప్ తీవ్రంగా ఖండించింది. కాగా సిసిటి పరిశీలించి అగంతకులను గుర్తించాలని నరేష్ యాదవ్ పోలీసులను కొరారు. కాగా కేంద్రమంత్రి అనురాగ్ థాకూర్ గోలీమార్ స్లోగన్ ప్రభావం వల్లే ఇదంతా జరుగుతోందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Aam Aadmi Party worker died in Delhi
- Advertisement -