Thursday, May 2, 2024

పథకాల అమలే పరమావధి

- Advertisement -
- Advertisement -

KCR

 

ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు

సంక్షేమంలో మనమే నంబర్ వన్

కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు
 15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం
జరగాలి n అడవులను అభివృద్ధి చేయాలి n ఎస్‌సి, ఎస్‌టి ప్రాంతాల నుంచే అభివృద్ధి
కార్యక్రమాలు n మున్సిపల్ శాఖలో త్వరలో ఖాళీల భర్తీ, నెలనెలా నిధులు

11గంటల పాటు సుదీర్ఘ సమావేశం

హైదరాబాద్ : రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప, ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు ఉద్భోదించారు. విస్తృత మేధోమథనం, అనేక రకాల చర్చోప చర్చలు, అ సెంబ్లీలో విస్తృత చర్చ- విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుందన్నారు. ఈ మేరకు పలు కార్యక్రమాల ను చేపడుతోందన్నారు.

పార్లమెంటరీ ప్రజాస్వా మ్య విధానం అవలంబిస్తున్న మన దేశంలో ప్రజ లు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానా లు, పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడ మే కలెక్టర్ల ప్రాధాన్యతగా ఉండాలన్నారు. ప్రగతిభవన్‌లో మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది.

మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రాధాన్యతలను, బాధ్యతలను వివరించారు. ఈ సం దర్భంగా వారిని ఉద్దేశించి సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, తెల ంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామన్నారు. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందన్నా రు. ప్రస్తుతం రా ష్ట్రంలో రూ.40వేల కోట్లతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఉండేదని, అయితే చాలా తక్కువ సమయంలోనే ఆ సమస్యను అధిగమించామన్నారు. నేడు దేశంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన నిరంతరంగా విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలవడం మనందరికీ గర్వకారణమన్నారు.

మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
మిషన్ భగీరథ పథకం వల్ల ప్రజల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందని సిఎం వ్యాఖ్యానించారు. గతంలో వేసవి వచ్చిందంటే ఎక్కడ చూసినా ప్రజలు మంచినీటికి అవస్థలు పడేవారన్నారు. మంత్రుల ఇళ్ళు, కలెక్టర్ల కార్యాలయాల ముందు ముందు బిందెల ప్రదర్శనలు చేసే వారని గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీరు అందుతున్నదన్నారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సాగునీటి వసతి ఏర్పడుతున్నదన్నారు. ఇలా ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా సాగుతున్నాయి.

పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివెరియాలి
ఇప్పుడు మన ముందు ఉన్న అత్యంత ప్రాధాన్యతతో కూడిన పని పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియడమేనని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అదే మనకు అత్యంత ముఖ్యమైన పని అన్నారు. కలెక్టర్లు ఎవరి ప్రాధాన్యాలు వారు ఎంచుకోవద్దు అని సూచించారు. అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యత ఉండాలని సిఎం పేర్కొన్నారు. ఒక టీమ్‌లాగా అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనా విభాగాలు చిన్నవి అయ్యాయన్నారు.

ఇది పల్లెలను బాగు చేసుకోవడానికి ఎంతో సానుకూల అంశంగా సిఎం పేర్కొన్నారు.అలాగే పల్లెల అభివృద్ధికి నిధుల కొరత సమస్య కాకుండా ప్రతి నెలా రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నామన్నారు. వేరే ఖర్చులు ఆపుకునైనా సరే గ్రామాలకు నిధులు ఇస్తున్నామని సిఎం తెలిపారు. అన్ని గ్రామాలకు గ్రామ కార్యదర్శులను నియమించామని. ఎంపిఒలను, ఎంపిడిఒలను, డిఎల్‌పిఒ, డిపిఒ, జెడ్‌పి సిఇఒ లాంటి పోస్టులన్నింటినీ భర్తీ చేశామన్నారు.

పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచామన్నారు. అలాగే ప్రతీ గ్రామంలో ట్రాక్టర్లను సమకూర్చుకునే అవకాశం కల్పించామని సిఎం తెలిపారు. ఇక విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామన్నారు. నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రైబ్యునల్ ఏర్పాటు చేశామని, ప్రభుత్వం తన అధికారాలను వదులుకుని కలెక్టర్లపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని, ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చే విధంగా పనిచేయించే బాద్యతను కలెక్టర్లు తీసుకోవాలన్నారు.

కలెక్టర్ల వ్యవస్థ మరింత బలోపేతం
కలెక్టర్ల వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం కెసిఆర్ తెలిపారు. అందుకే కలెక్టర్లకు అండగా ఉండడం కోసం అడిషనల్ కలెక్టర్లను ప్రభుత్వం నియమించిందన్నారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలన్నారు. కలెక్టర్లపై ప్రభుత్వం ఎంతో నమ్మకం ఉంచిందని, అదే సందర్భంలో కలెక్టర్లకు ఎంతో బాధ్యత కూడా ఉందన్నారు. గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు చైర్మన్ గా వ్యవహరించేవారని కాని ఇప్పుడు వాటిని 26 విభాగాలుగా మార్చామన్నారు. దీనివల్ల కొంత పని వత్తిడి తగ్గుతుందన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధించడం లక్ష్యంగా ఇప్పటి వరకు రెండు విడతలుగా నిర్వహించి న పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందన్నారు.

ఈ కా ర్యక్రమం నిరంతరం సాగాలని ఆదేశించారు. పల్లెల్లో విరివిగా మొక్కలు పెంచడంతో పాటు వాటిని సంరక్షించాలన్నా రు. గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరియాలని, మురికి గుంటలు, చెత్తా చెదారం తొలగించాలన్నారు. అదే సమయంలో పాడుపడిన బావులు పూడ్చివేయాలని సూచించారు. పాత బోరుబావులను పూడ్చడంతో పాటు ఈ పనులన్నింటినీ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కలెక్టర్లు జరిపించాలన్నారు. కలెక్టర్లకు సహాయకారగా ఉండేందుకు అడిషనల్ కలెక్టర్లను నియమించామన్నారు. వారిలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలకు కేటాయించామని, వారికి మరో పని అప్పగించవద్దని సూచించారు. ఒ క అడిషనల్ కలెక్టర్ కేవలం స్థానిక సంస్థలను సమర్థవంతంగా బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాలన్నారు.

25రోజుల్లో గ్రామాల పరిస్థితి మారాలి
రాబోయే పదిహేను రోజుల్లో జిల్లా స్థాయిలో ‘పంచాయతీ రాజ్ సమ్మేళనం’ నిర్వహించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలను ఆహ్వానించాలని సూచించారు. ఈ సమ్మేళనంలో గ్రామాలను అభివృద్ధి చేసుకునే పద్ధతి వివరించాలన్నారు. ఎవరి బాధ్యత ఏమిటో విడమరిచి చెప్పాలన్నారు. సర్పంచులు, కార్యదర్శులు ఏమేం చేయాలో వివరించాలన్నారు. మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, జెడ్‌పి చైర్ పర్సన్లను ముఖ్య అతిథులుగా పిలవాలన్నారు. సమావేశం తర్వాత పది రోజుల గడువు ఇవ్వాలి. ఆలోగా గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పాలన్నారు. మొత్తంగా 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పు రావాలని ఆదేశించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

ఫ్లయింగ్ స్క్వాడ్ లు పర్యటిస్తాయన్నారు. ముఖ్యమంత్రిగా తాను కూడా ఆకస్మిక పర్యటనలు చేస్తానన్నారు. ఏ గ్రామం అనుకున్న విధంగా లేకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలను బాగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. పల్లె ప్రగతి కార్యక్రమం కొద్ది కాలం చేసి ఊరుకునే కార్యక్రమం కాదు…. కేవలం స్పెషల్ డ్రైవ్‌గా కూడా కాదు… ఇది నిరంతరం సాగాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో నాటిన మొక్కల్లో 85 శాతం ఖచ్చితంగా బతికించాలని పేర్కొన్నారు. గ్రామంలో స్మశాన వాటికలు, ఖనన వాటికలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలన్నారు. చెట్లకు నీళ్లు పోయడానికి, చెత్త ఎత్తివేయడానికి ట్రాక్టర్ ను కొనుగోలు చేయాలన్నారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు తమ దృష్టికి వచ్చిన అత్యవసర, అత్యంత ప్రాముఖ్యత కలిగిన పనులు చేయడానికి ప్రతీ కలెక్టర్ వద్ద ఒక్కో కోటి రూపాయల చొప్పున అందుబాటులో ఉంచుతామన్నారు. సిఎం ఆదేశాలతో వెంటనే దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

అడవులను అభివృద్ధి చేయాలి
పది ఎకరాల అటవీభూమిలో అడవిని అభివృద్ధి చేయడం అంటే పదివేల ఎకరాల్లో సామాజిక అడవులు పెంచడంతో సమానమని సిఎం కెసిఆర్ అన్నారు. కాబట్టి అడవిని పునరుద్ధరించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కోరారు. హైదరాబాద్, గద్వాల, కరీంనగర్, జనగామ, వరంగల్ అర్బన్, యాదాద్రి, సూర్యాపేట, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అడవుల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కలెక్టర్లు సామాజిక అడవులు పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మంత్రులు, కలెక్టర్ల బాధ్యత అని తెలిపారు.

ఎస్‌సి, ఎస్‌టి ప్రాంతాల నుంచే కార్యక్రమాలు
ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమమైనా ముందుగా ఎస్‌సి, ఎస్‌టి ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలని సిఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌సి, ఎస్‌టి వర్గాలు సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నారన్నారు. కార్యక్రమాల అమలును అక్కడి నుంచే ప్రారంభించాలని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో దాదాపు ఖాళీలన్నీ భర్తీ చేశాము. ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే అక్కడ వేరొకరిని నియమించే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నామన్నారు. పల్లె ప్రగతి మాదిరిగానే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా ప్రభుత్వం ప్రారంభిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తుందన్నారు.

మున్సిపల్ శాఖలో త్వరలో ఖాళీల భర్తీ
పంచాయతీ రాజ్ శాఖ మాదిరిగానే మున్సిపల్ శాఖలో కూడా అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం తెలిపారు. ఎన్ని ఖాళీలున్నాయి? ఎక్కడెక్కడ ఏ పోస్టులు భర్తీ చేయాలో మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో గతంలో కేవలం 6 మున్సిపల్ కార్పొరేషన్లుంటే, వాటిని 13కు పెంచుకున్నామన్నారు. ము న్సిపాలిటీల సంఖ్యను 68 నుంచి 128 చేసుకున్నాం. మొత్తం 141 పట్టణ స్థానిక సంస్థలకు నిధులు కూడా సమకూరుస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరానికి నెలకు రూ.78 కోట్ల చొప్పున, మిగతా పట్టణాలు, నగరాలకు రూ.70 కోట్ల చొప్పున విడుదల చేస్తాం. ఈ నిధులతో పాటు, స్థానికంగా సమకూరే నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. -సముద్రం ఒడ్డున లేని నగరాల్లో కాలుష్యం పెరగడానికి అవకాశాలు ఎక్కువున్నాయని, అదే ప్రస్తుతం ఢిల్లీని పట్టిపడీస్తోందన్నారు.

కాగా నివాసయోగ్యమైన నగరాల జాబితాలో ముందున్న హైదరాబాద్ నగరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే కాలుష్య కాసారం కాకతప్పదని హెచ్చరించారు. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త వహించాలన్నారు. హైదరాబాద్ నగరం లోప ల, చుట్టూ కలిపి లక్షా 60వేల ఎకరాల అటవీ భూమి ఉందన్నారు. అందులో దట్టమైన అడవులు పెంచాలన్నారు. వనస్థలిపురం హరిణవనస్థలిని కెబిఆర్ పార్కు ల్లా తయారు చేయాలన్నారు. నగరంలో కాలుష్యం నివారించడానికి అనుగుణమైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. పెట్రోవాహనాలను తగ్గించి, ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య పెంచే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నగరాన్ని కాలుష్యమయం కాకుండా చూసుకోవాలనే స్పృహ ప్రతి ఇంటిలో కూడా కలిగించే చర్యలు తీసుకోవాలన్నారు.

KCR said We are number one in welfare
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News