Saturday, July 27, 2024

మండుటెండలో పింఛన్ కోసం వృద్ధులకు తప్పని తిప్పలు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి నెల వారికి ఊర్లల్లో ఉండే వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్తుండేవారు. ఎండ, వాన.. దేనిని లెక్క చేయకుండా వాలంటీర్లు వృద్ధాప్యంలో ఉన్న వారికి సేవలందించేవారు. కానీ ఇప్పుడు ఎండలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంక్ కి వెళ్లి క్యూలో నిలబడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాలంటీర్లు ఉన్నపుడు.. స్వయంగా వారే తమ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారని, ఇప్పుడైతే మేము ఇలా ఎండలో ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఈ వయస్సులో తమని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు అంటూ గోల పెడుతున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఒక్కటీ లేవని చెబుతున్నారు. బ్యాంకు డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నవారికి ఒకటో తారీఖున పెన్షన్లు పడ్డాయని, బ్యాంకు వివరాలు సరిగ్గాలేని వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ఉదయం 7 గంటలకు బ్యాంకుకి వెళ్లి.. 11 గంటల వరకుక్యూలో నిలబడితే.. 12 గంటలకు సర్వర్ పనిచేయటం లేదని కొన్ని చోట్ల బోర్డులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతసేపు వారు ఎదురుచూసినా పని అవ్వకపోగా.. రేపు మళ్ళీ బ్యాంకుకి రండి అంటూ పంపేస్తున్నారని వృద్ధులు మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News