Friday, March 29, 2024

హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో హత్య …నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద కనకాపూర్ బ్రిడ్జి కింద శవం
హత్య చేసిన కుటుంబీకులు, కిరాయి హంతకులు అరెస్ట్
పరారీలో మరో ముగ్గురు హంతకులు

మన తెలంగాణ/ నిర్మల్ ప్రతినిధి ( లక్ష్మణ చాంద) : నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం లోని కనకాపూర్ వాగు బ్రిడ్జి కింద ఇటీవల ఒ గుర్తు తెలియని శవం లభ్యం విషయం తెలిసిందే . కాగా మిస్టరీగా మారిన ఈ హత్య కేసును పోలీసులు చా కచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకొని తీ గ లాగింతే డొంక కదిలింది. ఆదివారం నిర్మల్ డి ఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సోన్ సీఐ. రాం నర్సింహారెడ్డి, ఎస్సై రాహుల్‌గైక్వాడ్, పోలీస్ సిబ్బంది నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో హత్య వివరాలు పూర్తిగా వెల్లడించారు. జగిత్యాల జిల్లా మెట్‌పెల్లి మం డలం వేంపేట్ గ్రామానికి చెందిన కంచికట్ల స్వప్న మొదటి పెళ్లీ తరువాత విడాకులు అయి హైదరా బాద్‌లోని ఓ వస్త్రాలయంలో పని చేస్తుండగా శ్రీని వాస్ నిత్యం ఆ షాపులోకి వెళ్లగా స్వప్న శ్రీనివా స్‌లకు ప రిచయం ఏర్పడి ప్రేమగా మారి వివాహం చేసుకు న్నారు. స్వప్న శ్రీనివాస్‌లకు తరుణ్ అనే (19)కు మారుడు, సిరి వెన్నల అనే (15) కూతురు లు ఉన్నారు. కాగా శ్రీనివాస్ ఆటో సంపాదన మీద బా గానే సంపాదించి హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. కానీ శ్రీ ని వాస్‌కు గత తొమ్మిది సంవత్సరాల క్రితం నుండి నందిని అనే అమ్మాయితో అక్రమ సంబంధం ఉం ది.

ఈ విషయం శ్రీనివాస్ భార్య స్వప్నకు తెలిసి ఇంట్లో తరుచు గొడువలు అయ్యేవి, అయినా కూ డా శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు రాలేదు. శ్రీనివాస్ అక్రమ సంబంధం అయినా నందినికి హైదరాబాద్ లోని ఉప్పల్‌లోనే ఒక ఇల్లు కొని ఆమెను అందులో ఉంచి ఆమెతో అక్రమ సంబంధం గడుపుతూ శ్రీని వాస్ భార్య స్వప్న, వారి పిల్లలను పట్టించుకోకుం డే ఉండేవాడని,శ్రీనివాస్ పై విరక్తి చెందిన భార్య స్వప్న, కుమారుడు తరుణ్‌లు శ్రీనివాస్‌ను చం పాలని పథకం వేశారు. పథకం ప్రకారమే స్వప్న త న మొదటి భర్తకు పుట్టిన కొడుకు రాజ్ కుమార్, త న అక్క కొడుకు పోశెట్టి నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఉంటున్నా వారికి తెలిపింది. శ్రీనివాస్‌ను చంపితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి న వారు ఒప్పుకున్నారు. కానీ శ్రీనివాస్‌ను చంపుట కు కిరాయి మనుషులను మాట్లాడ్తాం అని రూ. 5 లక్షలకు కిరాయి మనుషులను మాట్లాడారు. అ నుకున్నట్లుగా జనవరి 22 తారీఖు రాత్రి సమ యంలో నిద్రిస్తున్న శ్రీనివాస్‌ను భార్య స్వప్న, కు మారుడు తరుణ్, పోశెట్టి, రాజ్‌కుమార్‌లు, కిరా యి గుండాలు శ్రీనివాస్ తల పై రోకలి బండతో కొ ట్టి,కాళ్లు కట్టేసి బలంగా కొట్టడంతో శ్రీనివాస్ అ క్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కిరాయి గుండాలు తాము వచ్చిన పని అయిపోయిందన తమకు డ బ్బులు ఇవ్వాలని అడుగగా ఇప్పుడు తన దగ్గర డ బ్బులు లేవని శ్రీనివాస్ భార్య చెప్పడంతో మృతుడు శ్రీనివాస్ పై ఉన్న బంగారం గొలుసు.

బంగారు బ్రస్టైట్, బంగారు రింగ్, తీసుకొని వెళ్లీపోయారు. తరువాత శ్రీనివాస్ మృతదేహాన్ని పోశెట్టి, రా జ్ కుమార్, చిక్కాలు కలిసి రెండు చేద్దర్లల్లో చు ట్టుకొ ని కారులో తీసుకెళ్లి నిర్మల్ జిల్లా లక్ష్మణచాం ద మండలం, కనకాపూర్ గ్రామ శివారులోని వాడు బ్రిడ్జి కింద పడేశారని డిఎస్పీ ఉపేందర్‌రెడ్డి వివరా లు వెల్లడించారు. నిందితుల నుండి ఒక కారు, ఒ క టాటా మేజిక్, 2 మోటార్ సైకిల్స్, 10 సెల్ ఫో న్లు, బంగారపు చైను, బంగారపు రింగ్, 75 వేల న గదు,1 రోకలి బండ, 2కర్రలు, 2 బండరాళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎంతో కష్టపడి మిస్టరీగా మారిన హత్య కేసును చేదించి చాకచక్యంగా ప ట్టు కున్న సోన్ సీఐ రాం నర్సింహారెడ్డి, లక్ష్మణచాం ద ఎస్సై రాహుల్‌గైక్వాడ్,నిర్మల్ ఎస్సైలను డిఎస్పీ ఉ పేందర్‌రెడ్డి అభినందించారు. నిందితులపై చట్టప రంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News