Friday, April 26, 2024

బస్సు బీభత్సం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Five Members dead in bus accident in UP

లక్నో: బస్సు బీభత్సం సృష్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది.   బస్సు పాదాచారులపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు అక్కడ ఉన్న లారీ ఢీకొని ఆగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. బస్సు ఎలక్ట్రిక్ వాహనమని, బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News