- Advertisement -
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మళ్లీ మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత వారం రోజుల్లోనే కోవిడ్ పాజిటివ్ కేసులు ఐదు రెట్లు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,700 కోవిడ్ కేసులు, ఏడు మరణాలు నమోదు అయ్యాయని తెలిపింది. ప్రధానంగా మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా తీవ్రత అధికంగా ఉందని చెప్పింది. కేరళలో 1,147 పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 424, ఢిల్లీలొ 294 కేసులు బయటపడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. మళ్లీ కరోనా విపత్తు వస్తే..ఎదుర్కొనేందుకు కేంద్రం పూర్తి సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య, ఆయుష్ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ చెప్పారు.
- Advertisement -