Thursday, April 25, 2024

రూ. 10 కోట్లు మోసంపై నటుడు నరేష్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Actor Naresh complains about Rs 10 crore fraud

మనతెలంగాణ/హైదరాబాద్ : కీ స్టోన్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన లింగం శ్రీనివాస్ తమ దగ్గర రూ.7.5 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించడం లేదని ఆదివారం నాడు సీనియర్ నటుడు నరేష్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వీడియోను విడుదల చేశారు. తమ కుటుంబంతో ఉన్న పరిచయంతో ఆ డబ్బులను హ్యాండ్ ఫైనాన్స్ ద్వారా తీసుకున్నారని అన్నారు. డబ్బులు తీసుకుని ఆరేళ్లు దాటినా ఇప్పటికీ తిరిగి చెల్లించలేదని ఈ విషయంపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో 3 రోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు ఓ వీడియో విడుదల చేశారు. తమకు ఇప్పటి వరకు వారి వద్ద నుంచి మొత్తం 10 కోట్ల రూపాయలు రావాలని అన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారని అందుకు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News