Saturday, April 27, 2024

రెండు విమానాలకు తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

కాఠ్మండ్ : ఎయిర్ ఇండియా, నేపాల్ ఎయిర్‌లైన్స్‌లకు చెందిన విమానాలకు పెను ప్రమాదం తప్పింది. గాల్లోనే దాదాపు ఢీకొన్నంత పని చేశాయి. వెంటనే హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. విధుల్లో అజాగ్రత్తగా వ్యవహరించినందుకు గాను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులపై నేపాల్ పౌర విమానయాన సంస్థ వేటు వేసింది. నేపాల్ పౌర విమానయాన సంస్థ వివరాల ప్రకారం నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం శుక్రవారం ఉదయం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి కాఠ్‌మండ్ కు బయల్దేరింది. ఇటు ఢిల్లీ నుంచి కాఠ్‌మండ్‌కు ఎయిర్ ఇండియా విమానం తీసుకుంది.

మార్గమధ్యలో నేపాల్ లోకి ప్రవేశించాక అవి అత్యంత సమీపానికి వచ్చాయి. ఎయిర్ ఇండియా విమానం 19 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకి దిగుతుండగా, ఆ సమయంలో నేపా ఎయిర్‌లైన్స్ విమానం అదే ప్రదేశంలో 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. రెండు విమానాలు అత్యంత సమీపంలో ఉన్నాయని రాడార్ హెచ్చరించడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. నేపాల్ విమానం వెంటనే ఏడు వేల అడుగులకు దిగింది. దీంతో ప్రమాదం తప్పినట్టయింది. ఈ ఘటనపై దర్యాప్తునకు నేపాల్ పౌర విమానయాన సంస్థ ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News