Friday, June 20, 2025

విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన శ్రీలంక క్రికెటర్

- Advertisement -
- Advertisement -

గాలే:  శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరుగుతున్న తన చివరి టెస్టు మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, జియోఫ్రీ బాయ్‌కాట్ లను మాథ్యూస్ అధిగమించాడు. ఈ మ్యాచ్ లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేపట్టిన మాథ్యూస్..  మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో సహా 39 పరుగులు చేశాడు. దీంతో స్వదేశంలో అతను మొత్తం 4,362 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బాయ్‌కాట్ (4,356), కోహ్లీ (4,336)లను మాథ్యూస్ అధిగమించి నయా రికార్డును నెలకొల్పాడు.

కాగా, ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో మూడో రోజు తొలి సెషన్ లో 495 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక జట్టు.. నాలుగో రోజు మరో 127 పరుగుల వెనుకంజలో ఉంది. ఇంకా ఒకరోజు మాత్రమే ఉండటంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఎక్కువగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News