Saturday, April 20, 2024

సూడాన్‌ నుంచి మరో 236 మంది భారతీయుల తరలింపు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కొనసాగుతోంది. సుడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను కేంద్రం ప్రభుత్వం స్వదేశానికి తరలిస్తున్నారు. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ కావేరీ’ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం, సూడాన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నారు.

తాజాగా జెడ్డా నుంచి 236 మందితో వాయుసేన విమానం ముంబై బయల్దేరినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార తెలిపారు. కాగా, ఇప్పటివరకు సూడాన్ నుంచి స్వదేశానికి మొత్తం 3వేలకు పైగా మంది సురక్షితంగా చేరుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News