Monday, May 6, 2024

చంద్రబాబుపై ఎపి సిఐడి పిటి వారంట్లు

- Advertisement -
- Advertisement -
తోసిపుచ్చిన ఎసిబి కోర్టు

మన తెలంగాణ/హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబుపై ఎపి సిఐడి దాఖలు చేసిన పిటి వారంట్లను ఎసిబి కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఎపి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎపి ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబుపై పిటి వారంట్లను ఎసిబి కోర్టులో దాఖలు చేసింది. అయితే చంద్రబాబుపై బెయిల్ ఉన్నందన పిటి వారంట్లు నిరర్ధకమౌతాయని ఎసిబి కోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో ఈ పిటి వారంట్లను సిఐడి దాఖలు చేసింది. ఎపి స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఎపి సిఐడి అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ లో అవకతవకలపై ఎపి సిఐడి అధికారులు ఎసిబి కోర్టులో పిటి వారంట్ దాఖలు చేశారు.

మరో వైపు ఎపి ఫైబర్‌గ్రిడ్ కేసులో కూడ చంద్రబాబుపై పిటి వారంట్ దాఖలు చేశారు. చంద్రబాబు బెయిల్‌పై ఉన్నందున పిటి వారంట్లకు విచారణ అర్హత లేదని ఎసిబి కోర్టు తోసిపుచ్చింది. ఎపి స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఈ ఏడాది అక్టోబర్ 31న ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ వచ్చింది. ఈ ఏడాది నవంబర్ 20న ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ కూడ చంద్రబాబుకు ఎపి హైకోర్టు మంజూరు చేసింది. ఎపి ఫైబర్ నెట్ , ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఎపి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడ పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. అయితే మంగళవారం పిటి వారంట్లపై ఎసిబి కోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది.

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నందున పిటి వారంట్లు విచారణకు అర్హత లేదని ఎసిబి కోర్టు తేల్చి చెప్పింది. చంద్రబాబుకు ఎపి హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఎపి సిఐడి సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ ఈ నెల 8వ తేదీకి విచారణ చేయనుంది. తమ వాదనలను ఎపి హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఎపి సిఐడి వాదించింది. ఈ నెల 8వ తేదీన విచారణలో సుప్రీంకోర్టులో ఇరు వర్గాలు తమ వాదనలను విన్పించనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News