Wednesday, June 11, 2025

నేరేడు పండ్లు తింటున్నారా..?

- Advertisement -
- Advertisement -

మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటే మన శరీరానికి కావాల్సినంత బలం వస్తుంది. ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాము. అయితే, పండ్లలో భాగంగా మనం నేరేడు పండు తినే ఉంటాము. నేరేడు పండ్లలో అనేక పోషకాలు నిండి ఉంటాయి. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, విటమిన్ సి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడతాయి. అయితే ఇప్పుడు నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

నేరేడు పండ్లలో గ్లూకోజ్, ప్రక్టోజ్ పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా ఈ పండ్లను తినడం వల్ల అజీర్ణం, కడుపునొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పండ్లు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఇందులో ఉండే పొటాషియం, ఐరన్, కాల్షియం రక్తహీనతను నివారిస్తుంది. నేరడు పండ్లలో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతూ, చర్మాని అనేక సమస్యల నుండి కాపాడుతుంది.

జాగ్రత్తలు
నేరేడు పండ్లను ఎప్పుడు ఖాళీ కడుపుతో తినకూడదు. కారణం.. ఇది వాతకారిగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఖాళీ కడుపుతో ఈ పండ్లను తీసుకుంటే గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పండును సరైన సమయంలో అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News