Saturday, April 27, 2024

ఆటోమోబైల్ దొంగల అరెస్టు..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః టిఎస్ ఎక్సెల్, బైక్‌లను చోరీ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను వెస్ట్‌జోన్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 టివిఎస్ ఎక్సెల్, హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఫతేనగర్‌కు చెందిన పిట్టేలా నాను, దూలపల్లికి చెందిన పార్థి రాము, కౌకురుకు చెందిన ఎస్‌కె జహంగీర్ కలిసి రోజు చేపలు పట్టేవారు. వాటిని విక్రయించి జల్సాలు చేసేవారు. దీని ద్వారా వచ్చే డబ్బులు వారి జల్సాలకు సరిపోకపోవడంతో చోరీలు చేయాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగా టివిఎస్ ఎక్స్‌ఎల్, హోండా యాక్టివాను చోరీ చేసి విక్రయిస్తున్నారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ బిక్షపతి, పిసిలు రవికుమార్, శ్రీనివాస్, ప్రవీణ్, ఖజావలూద్దిన్, ఇమ్రాన్, రవీందర్, రఘు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News