- Advertisement -
హైదరాబాద్ : నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 2,89,000 విలువైన సింథటిక్ నైలాన్ చైనీస్మాంజాను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని మంగళ్హాట్, కుమ్మర్వాడికి చెందిన చంద్రపాల్ సింగ్, రేయిన్బజార్కు చెందిన ఎండి బషీర్ కైట్స్ వ్యాపారం చేస్తున్నారు. చైనీస్ మాంజా విక్రయంపై నిషేధం ఉన్నా కూడా విక్రయిస్తున్నారు. విషయం టాస్క్ఫోర్స్ పోలీసులకు తెలియడంతో ఇద్దరిని అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్, ముజఫర్, రంజిత్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Arrest of Chinese Manja Sellers
- Advertisement -