Friday, May 3, 2024

నూతన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ల శ్రేణిని విడుదల చేసిన బజాజ్ ఆటో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్విచక్రవాహన, మూడు చక్రాల వాహన కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్, తమ నూతన కార్గో, ప్యాసింజర్ విద్యుత్ ఆటో శ్రేణిని ఈరోజు హైదరాబాద్‌లో విడుదల చేసింది. ప్రయాణీకుల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ను బజాజ్ RE E-Tec 9.0గా విడుదల చేసింది. బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ శ్రేణిని బజాజ్ ఆర్ & డి సెంటర్‌లో డిజైన్ చేసి అభివృద్ధి చేశారు. వీటిని వాలూజ్‌లోని కంపెనీ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఈ కొత్త వాహనాలు విస్తృత పరిధి , అత్యధిక లోడ్ మోసే సామర్థ్యం, దీర్ఘకాలిక మన్నిక కోసం రూపొందించారు.

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లలో IP67 రేటెడ్ అధునాతన Li-ion బ్యాటరీ, టూ-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ (PMS) మోటరు వున్నాయి. బ్యాటరీని 16-amp, 220 V ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌లో ఛార్జ్ చేయవచ్చు. ఈ వాహనాలు 5 సంవత్సరాలు లేదా 1.2 లక్షల కిమీల వారంటీతో పాటు, కస్టమర్‌లకు భరోసా ఇవ్వడానికి, 24/ 7 రోడ్‌సైడ్ సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటుంది.

బాబ్జి నెల్లి, డివిజనల్ మేనేజర్ సేల్స్, కుబేర్. కెవి, డివిజనల్ మేనేజర్ సర్వీస్, బజాజ్ ఆటో లిమిటెడ్‌ మాట్లాడుతూ “కొత్త బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను ప్యాసింజర్, కార్గో ఫార్మాట్‌లలో అందించడం సంతోషంగా వుంది. ఈ సురక్షితమైన, విశ్వసనీయమైన, అధిక-పనితీరు గల వాహనాలను అభివృద్ధి చేయడానికి వినియోగదారుల పట్ల మా లోతైన అవగాహనను ఉపయోగించాము. వినియోగదారులకు మా సేవలను విస్తరించేందుకు తెలంగాణ వ్యాప్తంగా మా డిస్ట్రిబ్యూషన్ సేవలను విస్తరించనున్నాము” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News