Saturday, July 27, 2024

సోనియా కుటుంబంతో బంగ్లాదేశ్ ప్రధాని భేటీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్‌పర్శన్ సోనియా గాంధీ , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం ఢిల్లీలో కలిశారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన హసీనా సోమవారం స్వదేశానికి తిరిగి వెళ్లనుండగా, హస్తినలో సోనియా కుటుంబ సభ్యులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శనివారం ఢిల్లీకి చేరుకున్నషేక్‌హసీనా ఆదివారం జరిగిన ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.

అయితే హసీనా ,గాంధీ కుటుంబానికి మధ్య గత కొన్నేళ్లుగా అనుబంధం ఉంది. షేక్‌హసీనా తండ్రి , బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత షేక్ ముజిబుర్ రెహమాన్ , అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఇందిరాగాంధీ కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌ను విముక్తి చేశారు. ఆ దేశ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వడంతో అప్పటి నుంచి ఇందిరాగాంధీ కుటుంబంతో వారికి సత్సంబంధాలు ఏర్పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News