Wednesday, May 1, 2024

భారత్‌పై బంగ్లా గెలుపు

- Advertisement -
- Advertisement -

కొలొంబో: ప్రేమదాసుస్టేడియంలో ఆసియా కప్‌లో భాగంగా భారత్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. చివరలో ఆరు పరుగుల తేడాతో బంగ్లా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. టీమిండియా 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 49.5 ఓవర్లలో 259 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 121 పరుగులు చేసినప్పటికి అతడికి ఏ బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లేకపోవడంతో భారత జట్టు ఓటమిని చవిచూసింది. చివరలో అక్షర పటేల్ మెరుపులు మెరిపించినప్పటికి గెలుపించలేకపోయాడు. ఇప్పటికే భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News