Tuesday, May 14, 2024

తల్లి తలపై సుత్తితో కొట్టి… నాలుక కోసి….

- Advertisement -
- Advertisement -

అమరావతి: కన్న కుమారుడు మద్యానికి బానిస మారి తల్లి నాలుక కోసి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా రామభద్రపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రామభద్రపురం గ్రామంలో శ్రీను అనే యువకుడు, తన తల్లి రమణమ్మ(75)తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. శ్రీను టిఫిన్ దుకాణం నడుపుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి శ్రీను మద్యానికి బానిసగా మారాడు. దీంతో తల్లి పలుమార్లు అతడిని మందలించింది. అతడిలో మార్పురాకపోగా రోజు ఆమెను వేధించసాగాడు. పూటుగా మద్యం తాగి వచ్చి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని రమణమ్మను కుమారుడు అడగడంతో ఆమె నిరాకరించింది. దీంతో ఆమె తలపై సుత్తితో బాది అనంతరం నాలుక కోసి అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News