Wednesday, May 1, 2024

రాష్ట్రపతి నిలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం వివిధ ఫోరమ్‌ల నుండి సుమారు 560 మంది మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా – లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, అక్షరయన్ అనే మహిళా రచయితల సంఘం, ఎన్‌ఐఈపిఐడి నుండి బుద్దిమాంద్యం ఉన్న పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు ఆనందోత్సహాలతో బతుకమ్మను ఆదారు. ఈ వేడుకలతో రాష్ట్రపతి నిలయం కోలాహలంగా, పండుగ వాతావరణంలా కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News