Saturday, April 27, 2024

పశ్చిమబెంగాల్ ఎమ్‌ఎల్‌ఎల వేతనం పెంపు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎల్‌ఎలు, మంత్రుల వేతనాలను నెలకు మరో రూ. 40 వేలు వంతున పెంచింది. బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఈమేరకు ఎమోల్ మెంట్స్ (సవరణ) బిల్లు 2023 ను ఆమోదించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్న ఈ సమావేశానికి విపక్ష బీజేపీ సభ్యులు గైర్హాజరయ్యారు. ఇప్పటివరకు నెల వేతనాలుగా ఎమ్‌ఎల్‌ఎలు రూ. 10 వేలు, సహాయ మంత్రులురూ 10,900, మంత్రులు రూ. 11,000 పొందుతున్నారు. ఈ పెంపువల్ల రూ.50,900 నుంచి 51,000 వరకు వేతనాలు లభిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News