Wednesday, May 1, 2024

కెసిఆర్‌వి కట్టుకథలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో చేరికలతో మాజీ సిఎం కెసిఆర్‌కు నిద్రపట్టడం లే దని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క విమర్శించా రు. పార్టీ లీడర్లను కాపాడుకునే ప్రయత్నంలో కెసిఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. వాస్తవాలను దాచి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆయన ఆగ్రహం వ్య క్తం చేశారు. సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో భ ట్టి విక్రమార్క మాట్లాడుతూ కెసిఆర్ మాట ల్లో కొంచెమైనా వాస్తవాలు లేవని భట్టి ఆగ్రహం వ్య క్తం చేశారు. పదేళ్లు సిఎంగా ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారుతారనుకోలేదన్నారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. నీళ్లు, కాళేశ్వరం గు రించి కెసిఆర్ నిజాలు చెప్పలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మీటింగ్‌లో మైక్ సమస్య వస్తే కరెం ట్ కోతలు అంటూ అబద్ధం మాట్లాడారంటూ భట్టి మండిపడ్దారు. రాష్ట్రంలో అనేక సమస్యలకు బిఆర్‌ఎస్ పాలనే కారణమని ఆయన ఆరోపించారు. సరిదిద్దుకోలేనంత తప్పిదాలు గత ప్రభుత్వమే చే సిందన్నారు. అస్థవ్యస్థమైన అర్థిక వ్యవస్థను మూ డు నెలల నుంచి గాడిలో పెడుతున్నామన్నారు.

కెసిఆర్ చేసిన అప్పుల్ని ఇప్పటికి తీర్చలేకపోతున్నామన్నారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు నిర్మించి న స్థలమే కరెక్ట్ కాదని  ఆయన చెప్పారు. పర్యావరణ అనుమతులు తెచ్చుకోకపో వడం వల్లే యాదాద్రి ప్రాజెక్టు ఆలస్యమవుతుందని ఆయన వెల్లడించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు..? , ఎవరి వల్ల ఆలస్యమైందో చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బొగ్గు లభించే ప్రాంతానికి 350 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందని, యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా కోసం భారీగా ఖర్చు అవుతుందని, విద్యుత్ సరఫరా లేకుంటే వినియోగం ఎలా పెరిగిందో చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. తెలంగాణకు 4వేల మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉందని, విభజన చట్టం ప్రకారమే రాష్ట్రానికి ఎన్టీపిసి మంజూరు అయిందన్నారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించాల్సి ఉండగా కమీషన్ల కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ప్లాంట్ నిర్మాణం చేపట్టింది కెసిఆర్ అని డిప్యూటీ సిఎం భట్టి ఆరోపించారు.

ఎండాకాలంలో సరిపడా విద్యుత్‌ను సరఫరా చేస్తాం
వచ్చే ఏప్రిల్, మే నెలలోనూ సరిపడా విద్యుత్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. దేశమంతా గ్రిడ్ అనుసంధానం 2013లోనే యూపిఏ ప్రభుత్వం చేసిందన్నారు. పదేళ్ల పాలనల్లో కెసిఆర్ ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలన్నారు. అందరికీ రెండు పడకల గదులు ఇల్లు నిర్మించి ఇచ్చారా? ప్రతి మండలంలో బాల బాలికలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్, ప్రతి నియోజకవర్గంలో కేజీ టు పీజీ విద్యాలయాలు నిర్మించారా? దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేశారా? చెప్పాలని డిప్యూటీ సిఎం భట్టి ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ ఐదేళ్లలో పూర్తి చేశారా?, వర్షాకాలంలో అధికారంలో ఉన్నది ఎవరు? వాన నీటిని రిజర్వాయర్లు నింపే పరిస్థితి లేకుండా చేసింది ఎవరు?, ప్రపంచంలోనే అత్యద్భుతం అని చెప్పిన కాళేశ్వరం కుంగిపోయిందని డిప్యూటీ సిఎం భట్టి ఆరోపించారు. అన్ని లెక్కలతో చర్చలకు రావడానికి తాను సిద్ధమని, మీరు సిద్ధమా? అని బిఆర్‌ఎస్ నేతలకు భట్టి సవాల్ విసిరారు. గత బిఆర్‌ఎస్ పాలకులు అస్తవ్యస్తంగా చేసిన పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం గాడిన పెడుతుంటే తట్టుకోలేక అక్కసుతో కెసిఆర్ తమపై అబద్ధపు, మోసపూరిత ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News