Wednesday, April 24, 2024

తప్పుడు కేసులు పెడితే బిజెపికి తగిన గుణపాఠం చెబుతాం: గద్వాల్ విజయ లక్ష్మి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఎంఎల్ సి కవితకు ఇడి నోటీసు ఇవ్వడం ఒక కక్షసాధింపు చర్య అని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మండిపడ్డారు. ఎం ఎల్ సి కవిత ఇడి నోటీస్ పై జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి స్పందించారు. ఇది ఒక దుర్మార్గపు చర్య అని, లిక్కర్ స్కామ్ పేరిట బిజెపి నాటకాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ విధానాలు ఎమర్జెన్సీ కన్నా దారుణంగా ఉన్నాయని దుయ్యబట్టారు. బిజెపి దర్యాప్తు సంస్థలను ప్రతి పక్షాలను వేధించేందుకు వాడుకోవడం సిగ్గు చేటు అని, ఈ డ్రామా ను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

కవిత బిఆర్ఎస్ పార్టీ విస్తరణలో క్రియాశీలంగా ఉన్నందుకే బిజెపి కక్ష కట్టిందన్నారు. నేతలు విచారణకు సహకరిస్తుంటే ఈ నోటీసులు, బెదిరింపులు అరెస్టులు దేనికని అడిగారు. సిబిఐ, ఇడిల విచారణ తీరు సరిగా లేదని, తప్పుడు కేసులు బనాయిస్తున్న బిజెపికి తెలంగాణ తగిన గుణపాఠం చెబుతుందన్నారు. కవితకు అందరూ అండగా ఉంటారని, ఢిల్లీలో మహిళ హక్కుల రక్షణకు, రిజర్వేషన్ల కై ఉద్యమిస్తున్న సమయంలో ఇటువంటి చర్యలు దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పారదర్శక పద్దతిలో విచారణ చేపట్టి ప్రతిపక్ష నేతలను వేధించడం మానుకోవాలని గద్వాల్ హితువు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News