Saturday, April 27, 2024

కవిత వల్ల తెలంగాణ తలవంచింది :ఎంపి అర్వింద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులివ్వడంపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించిన తీరును బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ తలవంచదంటూ స్పందించటాన్ని తప్పుబడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవిత ఒక్కరే కాదంటున్నారు.
ఈడీ నోటీసులిస్తే తప్పేంటి : కిషన్ రెడ్డి
బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. లిక్కర్ దందా చేసింది మీరు.. అక్రమంగా కోట్లు సంపాదించింది మీరు.. దాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం, బిజెపిపై విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారాయన. ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటీ అని నిలదీశారాయన. తప్పు చేయకపోతే ఫోన్లు ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించారు. మీ తప్పులపై నోటీసులు ఇస్తే.. తెలంగాణ సమాజానికి ముడిపెట్టి.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారా అంటూ కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
కవిత వల్ల తెలంగాణ తలవంచింది : అర్వింద్
కవిత వ్యాఖ్యలకు బిజెపి నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎప్పుడూ ఎవరికీ తలవంచలేదు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో లో మీ ప్రమేయం ఉందని ఈడి చెప్పడంతో దేశం ముందు సిగ్గుతో తలవంచుతోందని విమర్శించారు. లిక్కర్ స్కాం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో కవిత జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారని విమర్శించారు.
బిఆర్‌ఎస్ రాజకీయం చేస్తుంది : డికె అరుణ
లిక్కర్ స్కాంలో కవితతో పాటు అందరికీ నోటీసులు ఇచ్చారని.. ఆమెకు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదని బిజెపి మహిళా నేత డికె అరుణ అన్నారు. దీన్ని కక్ష సాధింపుగా బిఆర్‌ఎస్ రాజకీయం చేస్తుందని.. తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవిత ఒక్కరే కాదని.. తెలంగాణ సమాజం అని వ్యాఖ్యానించారు. మహిళలపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉందని.. ఈడీ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News