Saturday, May 4, 2024

కవితకు మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో ఎంఎల్‌సి కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ మరో 14 రోజుల పాటు పొడిగించారు. మే 7 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఇదే ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ కూడా మే 7వరకు పొడిగించింది. ఇడి కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ రెవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఇడి తరపున న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఇడి తరుఫు న్యాయవాది జోయబ్ పేర్కొన్నారు. కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని ఇడి తరుఫు న్యాయవాది వివరించారు. సెక్షన్ 19 అనుగుణంగానే కవిత అరెస్టు జరిగిందని వెల్లడించారు.

ఏప్రిల్ 11న కవితను సిబిఐ తీహార్ జైలు నుంచి అరెస్ట్ చేసింది. కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీ తీసుకుని విచారించింది. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా.. తొమ్మిది రోజుల పాటు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News